డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ... టీడీపీపై షర్మిల ఫైర్

  • మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం
  • పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్
  • మహేశ్ యాదవ్ కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్న అధికారులు
  • డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడడం సిగ్గుచేటన్న షర్మిల
  • అతడిపై అనర్హత వేటు వేయాలని, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటని విమర్శించారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియాలో స్పందిస్తూ... "ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఇక్కడ ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు చేయడం దారుణం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా? డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు?" అని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా? అని షర్మిల నిలదీశారు.

ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్‌పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే, ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు.

Putta Mahesh Kumar Yadav
Eluru MP
TDP MP
YS Sharmila
Drugs Party
Moinabad Farmhouse
Telangana Drugs
Chandrababu Naidu
AP Congress
Telugu Desam Party

More Telugu News